హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఫీజు బకాయిలపై బీజేవైఎం ఆధ్వర్యంలో ధర్నా

KMR: రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీ రీయింబర్స్‌మెంట్ స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువ మోర్చా BJYM ఆధ్వర్యంలో శుక్రవారం బాన్సువాడలో భారీ ర్యాలీ ధర్నా నిర్వహించారు. ఫీజు బకాయి బీజేపీ లడాయి పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో BJYM కార్యకర్తలు వివిధ కళాశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.