హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ నీరు.. కాలనీవాసుల అవస్థలు

MDCL: మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని సాయిరెడ్డినగర్, గణేష్‌నగర్ ఎన్‌క్లేవ్‌లో రోడ్లపై డ్రైనేజీ నీరు నిలిచిపోవడంతో కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దుర్వాసన, దోమల బెడదతో పారిశుద్ధ్య సమస్యలు తలెత్తుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదని, అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించాలని వారు కోరారు.