హైదరాబాద్: 28°C
తెలంగాణ

రైతులకు కోతల్లేని క‌రెంట్ ఇవ్వాల‌ని ధర్నా ‌

NLG: నకిరేకల్ నియోజకవర్గంలో రైతులకు కోతల్లేని 24 గంటల నాణ్యమైన విద్యుత్తును అందజేయాలని కోరుతూ నల్లగొండలోని ట్రాన్సకో విద్యుత్ ఎస్ఈ కార్యాలయం ముందు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ఆధ్వర్యంలో రైతన్నలతో కలిసి కాలిపోయిన బోరు మోటర్లతో పాటు ఎండిపోయిన వరి కట్టలతో ధర్నా చేప‌ట్టారు. ఈ ధ‌ర్నాకు రైతులు భారీగా హాజర‌య్యారు.