KDP: ప్రపంచ దోమల దినోత్సవం సందర్భంగా పులివెందుల నగరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో గురువారం అవగాహన ర్యాలీ నిర్వహించారు. వైద్యాధికారి డా. స్నేహ ప్రత్యూష, సబ్యూనిట్ అధికారి సిద్ధయ్య ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. దోమల నివారణ, మలేరియా నియంత్రణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'దోమల నివారణపై అవగాహన ర్యాలీ'


