హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు రామాలయంలో వరలక్ష్మీ వ్రతం

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఆగస్టు 21న శుక్రవారం సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ రంగ మండపంలో వ్రత కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. టీటీడీ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఆలయంలో సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు.