హైదరాబాద్: 28°C
తెలంగాణ

‘అరైవ్ అలైవ్’పై ట్రాఫిక్ ఫోకస్

HYD: హైదరాబాద్‌ ఎంజే కాలేజీలో ‘అరైవ్ అలైవ్’ ట్రాఫిక్‌ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జాయింట్‌ సీపీ డి. జోయెల్ డేవిస్‌ ఐపీఎస్‌, డీసీపీ అవినాష్‌ కుమార్‌ ఐపీఎస్‌ పాల్గొన్నారు. సుమారు 900 మంది విద్యార్థులకు ట్రాఫిక్‌ నిబంధనలు, రహదారి భద్రత, బాధ్యతాయుత ప్రయాణం, ఉల్లంఘనలపై అవగాహన కల్పించారు. సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా క్రమశిక్షణ పాటించాలని సూచించారు.