VKB: జిల్లాలోని గిరిగేట్పల్లిలో అడవి పందులు రైతు పొలంలోకి చొరబడి మొక్కజొన్న పంటను పూర్తిగా ధ్వంసం చేశాయి. రాత్రి 12 నుంచి ఒంటి గంట మధ్య దాడి చేసి సుమారు ఎకరం పంటను నాశనం చేసినట్లు రైతు తెలిపారు. పంట నష్టంతో రైతు కన్నీరుమున్నీరయ్యాడు. ప్రభుత్వం పంట నష్టాన్ని అంచనా వేసి ఆర్థికంగా ఆదుకోవాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
అడవి పందుల దాడిలో మొక్కజొన్న ధ్వంసం


