హైదరాబాద్: 28°C
క్రీడలు

క్వార్టర్ ఫైనల్స్‌కు చేరిన జాలీ- గాయత్రి జోడీ

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్స్-2026లో మహిళల డబుల్స్‌లో భారత జోడీ ట్రీసా జాలీ - గాయత్రి గోపీచంద్ క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. రౌండ్ ఆఫ్ 16 పోరులో జపాన్‌కు చెందిన రిన్ ఇవనాగా - కీ నకానిషి జంటపై 21-16, 21-12 తేడాతో వరుస గేమ్స్‌లో విజయం సాధించింది. శుక్రవారం జరిగే క్వార్టర్ ఫైనల్స్‌లో చైనా జంట జియా - జాంగ్‌తో తలపడనుంది.