హైదరాబాద్: 28°C
తెలంగాణ

'SIRను పారదర్శకంగా పూర్తి చేయాలి'

KMM: SIRలో భాగంగా నో మ్యాపింగ్‌, అనామలీస్‌ ఓటర్లకు నిబంధనల ప్రకారం నోటీసులు జారీ చేసి, తదుపరి ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ దివాకర టీఎస్‌ అధికారులను ఆదేశించారు. గురువారం రఘునాథపాలెం మండలం వీ.వెంకటాయపాలెం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ల పరిష్కార ప్రక్రియను పరిశీలించారు. ప్రక్రియను నిబంధనల ప్రకారం నిర్వహించేందుకు పలు సూచనలు చేశారు.