హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీవ్ గాంధీకి మంత్రి కోమటిరెడ్డి నివాళులు

నల్గొండ పట్టణంలోని హైదరాబాద్‌ రోడ్డులో రాజీవ్‌ గాంధీ 82వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. రాజీవ్‌ గాంధీ దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్లేందుకు సాంకేతికత, యువత, గ్రామీణాభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు.