హైదరాబాద్: 28°C
తెలంగాణ

గండిపేటలో కమిషనర్‌ శ్రీజన వార్డు పర్యటన

HYD: సైబరాబాద్‌ మున్సిపల్‌ కమిషనర్‌ గుమ్మల్ల శ్రీజన ‘వన్‌ వార్డు- ఎవ్రీ డే’ కార్యక్రమంలో భాగంగా గండిపేట వార్డులో పర్యటించారు. ఖానాపూర్‌ కమ్యూనిటీ హాల్‌లో ప్రజలు, ఆర్‌డబ్ల్యూఏ ప్రతినిధులతో సమావేశమై తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, దోమలు, వీధిదీపాలు తదితర సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.