హైదరాబాద్: 28°C
క్రీడలు

ప్రిక్వార్టర్స్‌కు P.V సింధు, ఆయుష్‌ శెట్టి

ప్రపంచ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్‌లో భారత షట్లర్లు సింధు, ఆయుష్‌ శెట్టి ప్రిక్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో సింధు 21-16, 21-17 తేడాతో వరుస సెట్లలో వెన్ యు జాంగ్ (కెనడా)ను చిత్తు చేసింది. పురుషుల సింగిల్స్ రెండో రౌండ్‌లో ఆయుష్ శెట్టి 21-8, 21-10 తేడాతో అబేవిక్రమ (శ్రీలంక)పై సునాయాస విజయం సాధించాడు.