హైదరాబాద్: 28°C
క్రీడలు

హాకీ WC: పాక్‌పై ఆధిక్యంలో భారత్

హాకీ ప్రపంచకప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు ఆధిక్యంలో ఉంది. రెండు క్వార్టర్లు పూర్తయిన తర్వాత 4-2తో దాయాది జట్టుపై ఆధిక్యం ప్రదర్శిస్తోంది. మ్యాచ్ ప్రారంభమైన 5వ నిమిషంలో హర్మన్‌ప్రీత్.. 11వ నిమిషంలో అభిషేక్ గోల్ చేశారు. రెండో క్వార్టర్‌లో హర్మన్‌ప్రీత్, అభిషేక్ మళ్లీ చెరో గోల్ కొట్టారు.