హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పోలింగ్‌ కేంద్రాల్లో వసతులు పరిశీలన

KRNL: సీ.బెళగల్‌ (మం) పరిధిలోని కొత్తకోట, కే.సింగవరం, ఈర్లదిన్నె, ముడుమాల, కొండాపురం, గుండ్రేవుల గ్రామాల్లోని పోలింగ్‌ కేంద్రాలను ఎంపీడీవో రాణెమ్మ బుధవారం తనిఖీ చేశారు. కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్లు తదితర వసతులపై ఆరా తీశారు. పోలింగ్‌ కేంద్రాల్లో అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.