హైదరాబాద్: 28°C
తెలంగాణ

తప్పుడు ప్రచారంపై పోలీసులకు ఫిర్యాదు

MLG: రాష్ట్ర యువజన కాంగ్రెస్ కార్యదర్శి కుంజా సూర్యపై బీఆర్‌ఎస్ మాజీ రేడ్కో ఛైర్మన్ వై.సతీష్‌రెడ్డి చేసిన బెట్టింగ్ ఆరోపణలు నిరాధారమని యువజన కాంగ్రెస్ నాయకులు ఖండించారు. బుధవారం ఏటూరునాగారం పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై మహేష్‌కు ఆర్టీఏ మెంబర్ వసంత శ్రీనివాస్, యువజన కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు.