హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'వాయుకాలుష్యాన్ని త‌గ్గించాలి'

విజయనగరంలో వాయుకాలుష్య నియంత్రణకు సమగ్ర ప్రణాళికను రూపొందించి అమ‌లు చేయాల‌ని కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. నేషనల్ క్లీన్ ఎయిర్ కార్యక్రమంపై కలెక్టర్ వీసీ ద్వారా సంబంధిత అధికారుల‌తో బుధ‌వారం సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. వాయుకాలుష్యం ఎక్కువగా ఉందని, దానిని తగ్గించేందుకు వివిధ శాఖల సమన్వయంతో కృషి చేయాల‌ని సూచించారు.