విశాఖ జిల్లా మత్స్యకార అధ్యక్షుడిగా వాసుపల్లి ధనరాజు నియమితులయ్యారు. ఈ సందర్భంగా బుధవారం ఆశీలమెట్టలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ధనరాజు అన్నారు. పదవి అలంకారం కాదని, బాధ్యత అని గణేష్ పేర్కొన్నారు. మత్స్యకారుల సమస్యలపై పోరాడాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: జిల్లా మత్స్యకార అధ్యక్షుడు నియామకం


