హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మిట్స్‌లో పీహెచ్‌డీ ఓరియంటేషన్

అన్నమయ్య: మదనపల్లె సమీపంలోని మిట్స్ డీమ్డ్ టు బి యూనివర్సిటీలో నూతన పీహెచ్‌డీ పరిశోధకులకు ఓరియంటేషన్ నిర్వహించారు. జేఎన్‌టీయూ అనంతపురం ప్రొఫెసర్ ఎస్.వి. సత్యనారాయణ పాల్గొని పరిశోధనలు సమాజ సమస్యలకు పరిష్కారాలు చూపేలా ఉండాలని సూచించారు. ఏఐ, చాట్‌జీపీటీని సహాయక సాధనాలుగా మాత్రమే వినియోగించాలని, పరిశోధనా నైతికత పాటించాలని తెలిపారు.