JN: జనగామ పట్టణంలోని పీఎస్ నుంచి విడుదలైన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. రెవెన్యూ శాఖను, పోలీసులను అడ్డుపెట్టుకుని పేదల భూములను దోచుకుంటున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నాయకుల అరాచకాలకు అధికారులు సహకరించవద్దని సూచించారు. మరో రెండేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని, అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లొంగవద్దన్నారు.
తెలంగాణ
VIDEO: ప్రలోభాలకు లొంగవద్దు: ఎర్రబెల్లి


