హైదరాబాద్: 28°C
తెలంగాణ

'రవితేజపై దాడికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలి'

BHPL: దళిత విలేకరి పుల్ల రవితేజపై దాడి ఘటనలో నిందితులందరినీ అరెస్టు చేయకపోవడంపై సీపీఐ(ఎంఎల్‌) జిల్లా కార్యదర్శి మారేపల్లి మల్లేష్‌ ప్రశ్నించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రవితేజను పరామర్శించారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి, బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.