హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెరువు అభివృద్ధిపై అధికారుల సమీక్ష

MDCL: కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పర్మార్ పింకేష్‌కుమార్ లలిత్‌కుమార్, ఎస్‌ఈ, ఈఈ, డీసీలతో కలిసి దుండిగల్ సర్కిల్‌లోని చింతల్‌కుంట చెరువు అభివృద్ధి పనులను పరిశీలించారు. వరద ముంపు సమస్యను తగ్గించి వర్షపు నీరు సాఫీగా వెళ్లేలా చెరువు అలుగు నుంచి నర్లకుంట చెరువు వరకు ప్రతిపాదిత అవుట్‌లెట్ డ్రెయిన్ నిర్మాణంపై అధికారులతో చర్చించారు.