హైదరాబాద్: 28°C
తెలంగాణ

జిల్లా ఎస్పీని కలిసిన నూతన పోలీస్ అధికారుల సంఘం

SRCL: రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన పోలీస్ అధికారుల సంఘం కార్యవర్గ సభ్యులు బుధవారం ఎస్పీ మహేష్ బి. గితేను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలు అందజేశారు. నూతన కార్యవర్గానికి ఎస్పీ అభినందనలు తెలిపారు. పోలీస్ సిబ్బంది సమస్యలపై తక్షణమే స్పందించి, పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు, సంఘం సభ్యులు పాల్గొన్నారు.