హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఎన్నికల బహిష్కరణ

అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కొండమీదపల్లి గ్రామానికి చెందిన వాల్మీకి బోయలు కీలక తీర్మానం చేశారు. వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చే వరకు ఎలాంటి ఎన్నికల్లోనూ ఓటు వేయకుండా ఎన్నికలను బహిష్కరిస్తామని ఏకగ్రీవంగా ప్రకటించారు. రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి, ఎన్నికల అనంతరం అమలు చేయడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.