VZM: చీపురుపల్లి మేజర్ పంచాయతీ పరిధిలో శానిటరీ ఇన్స్పెక్టర్ రామ్మోహనరావు పర్యవేక్షణలో బుధవారం పలు కాలనీలలో స్వచ్చ పథం నిర్వహించారు.ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికులు ఇంటింటికీ తిరిగి తడి, పొడి చెత్తను సేకరించారు. పరిసరాలను పరిశుభ్రం చేశారు. సేకరించిన చెత్తను ట్రాక్టర్ల ద్వారా చెత్త కేంద్రాలకు తరలించి వేరుచేసి ఎరువులు తయారు చేస్తామని ఆయన తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
శానిటరీ ఇన్స్పెక్టర్ పర్యవేక్షణలో స్వచ్చపథం


