హైదరాబాద్: 28°C
క్రీడలు

భారత్ వ్యూహంపై హర్షా భోగ్లే విమర్శలు

శ్రీలంకతో తొలి టెస్టులో టీమిండియా అనుసరించిన గేమ్‌ప్లాన్‌పై ప్రముఖ వ్యాఖ్యాత హర్షా భోగ్లే విమర్శలు గుప్పించాడు. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ తగినన్ని పరుగులు చేయకుండా చాలా సమయం వృథా చేసిందని, మరింత దూకుడుగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. వాతావరణం అనిశ్చితిగా ఉన్నప్పుడు బ్యాటింగ్ కోసం ఇంత ఎక్కువ సమయం తీసుకోవడం సరికాదని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నాడు.