హైదరాబాద్: 28°C
వ్యాపారం

భారత్‌లో గూగుల్ పిక్సెల్ ఫోన్ల తయారీ?

అమెరికా-చైనా ఉద్రిక్తతల నేపథ్యంలో టెక్ దిగ్గజం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుందని సమాచారం. తన పిక్సెల్ స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్‌వాచ్‌లు తదితర వేరబుల్ పరికరాల తయారీని చైనా నుంచి పూర్తిగా తరలించేందుకు సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో భారత్, వియత్నాం దేశాలకు భారీ ప్రయోజనం చేకూరనుందని 'నిక్కీ ఆసియా' నివేదిక వెల్లడించింది.