హైదరాబాద్: 28°C
తెలంగాణ

పరిహారం పేరిట రూ. 10 లక్షల మోసం ఆరోపణలు

BHPL: మేడిగడ్డ బ్యాక్‌వాటర్‌ పరిహారం ఇప్పిస్తానంటూ 13 మంది రైతుల నుంచి రూ. 10 లక్షలు వసూలు చేశారని కన్నెపల్లి రైతులు మంగళవారం ఆరోపించారు. 2020లో భూముల సర్వే సమయంలో నగదు తీసుకున్నా ఇప్పటివరకు పరిహారం అందలేదని తెలిపారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదని వాపోయారు.ఈ విషయాన్ని మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.