హైదరాబాద్: 28°C
తెలంగాణ

మిడ్ మానేరుకు పెరుగుతున్న వరద ప్రవాహం

SRCL: బోయిన్‌పల్లి మండలం మానువాడ మిడ్ మానేరు జలాశయంలో బుధవారం ఉదయం 6 గంటలకు 20.074 టీఎంసీల నీటి నిల్వ నమోదైంది. పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా నీటిమట్టం 314.83 మీటర్లుగా ఉంది. గత 24 గంటల్లో సగటున 613 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 127 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు. స్పిల్‌వే, రివర్ స్లూయిస్ గేట్లు మూసే ఉన్నాయి.