హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బద్వేల్‌లో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ

KDP: బద్వేల్‌ పురపాలక కార్యాలయంలో నశా ముక్త్‌ భారత్‌ అభియాన్‌ ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించారు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండి, ఆరోగ్యకరమైన, మాదకద్రవ్య రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్‌ మేనేజర్‌ బి. హరనాథ్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జి. రమణయ్య, సిబ్బంది పాల్గొన్నారు.