హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆరుత‌డి పంట‌ల‌కు ప్రాధాన్య‌మివ్వండి: క‌లెక్ట‌ర్

NTR: ప్రస్తుత వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ సూచించారు. ఎల్‌నినో ప‌రిస్థితుల నేప‌థ్యంలో ముందస్తు ప్రణాళికతో పంటల సాగు చేపట్టాలని తెలిపారు. మైల‌వ‌రం మండ‌లం, మొరుసుమిల్లిలో ఇవాళ జ‌రిగిన 'పొలం పిలుస్తోంది' కార్య‌క్ర‌మంలో ఆయన పాల్గొన్నారు.