GNTR: తాడేపల్లి మండలం ఉండవల్లి కొండవీడు వాగు సమీపంలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 6 ద్విచక్ర వాహనాలు, 2 సెల్ ఫోన్లు, రూ.24, 500 నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల రాకను గమనించిన నిర్వాహకుడు పవనకుమార్తో పాటు ముగ్గురు పరారయ్యారు. తాడేపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


