హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అసెంబ్లీలో జిల్లా సమస్యలపై గళం విప్పాలి'

ప్రకాశం జిల్లా ప్రజల సమస్యలను అసెంబ్లీ వేదికగా ప్రజాప్రతినిధులు చర్చించాలని సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కంకణాల ఆంజనేయులు డిమాండ్ చేశారు. మంగళవారం కొండేపి మండలం పెరిదేపిలోని ఎం.ఎస్. విజ్ఞాన కేంద్రంలో జరిగిన సీపీఎం కార్యకర్తల శిక్షణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 1000 కోట్లు కేటాయించారన్నారు.