హైదరాబాద్: 28°C
ఆరోగ్యం

మధ్యాహ్నం పెరుగు తింటున్నారా..?

మధ్యాహ్నం పూట భోజనంలో పెరుగు చేర్చుకోవడం ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరం. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడంలో అద్భుతంగా పనిచేస్తుంది. పెరుగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా పొట్టను చల్లబరిచి, అసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. అంతేకాకుండా, రోగనిరోధక శక్తిని పెంచి శరీరాన్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. పెరుగులో ఉండే కాల్షియం, ఫాస్ఫరస్.. ఎముకలు, దంతాలను బలంగా ఉంచుతాయి.