హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బంది

AKP: ఆర్టీసీ బస్సులో ప్రయాణికుడు మరిచిపోయిన ల్యాప్‌టాప్‌, బ్యాగును కండక్టర్‌ కేబీఆర్‌ లక్ష్మి భద్రంగా డిపోకు అప్పగించారు. ఈ నెల 16న 500 రూట్‌ బస్సులో వెంకట్‌రాజు ప్రయాణిస్తూ బ్యాగ్‌ను మరిచిపోయారు. ఈ మేరకు మంగళవారం డిపో మేనేజర్‌ అశ్విని ఆధ్వర్యంలో వాటిని వెంకట్‌రాజుకు అందజేశారు. కండక్టర్‌ లక్ష్మిని మేనేజర్ అభినందించారు.