హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తేజ భౌతికాయానికి నివాళులర్పించిన వైసీపీ ఇంఛార్జ్

ప్రకాశం: సీఎస్‌పురం మండలం డీజీపేట గ్రామానికి చెందిన సీనియర్ వైసీపీ నాయకులు చెవుల శ్రీనివాసులు కుమార్తె తేజ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న కనిగిరి వైసీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ దద్దాల నారాయణ యాదవ్ మంగళవారం పార్టీ నాయకులతో కలిసి తేజ భౌతికకాయాన్ని సందర్శించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.