హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజగోపాల్‌రెడ్డి డుమ్మా.. కాంగ్రెస్‌లో కొత్త చర్చ

NLG: ఏఐసీసీ మార్గదర్శకాల మేరకు భువనగిరిలో నిర్వహించిన ఉమ్మడి జిల్లా రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశానికి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి గైర్హాజరు కావడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చకు దారితీసింది. పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ఇటీవల ఆయన చేస్తున్న విమర్శల నేపథ్యంలో సమావేశానికి హాజరై తన అభిప్రాయాన్ని వెల్లడిస్తారని భావించినా, ఆయన రాకపోవడం ఆసక్తికరంగా మారింది.