KNR :హైదరాబాద్లో జరిగిన రాష్ట్రస్థాయి వెటరన్ ఈత పోటీల్లో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రశాంత్, రామారావు, రమేష్కుమార్, శ్రీధర్, వెంకటేశ్వర్లు, రాజయ్యలు వివిధ విభాగాల్లో పతకాలు సాధించారు. ఈ విజయంతో హర్యానాలో జరగనున్న జాతీయస్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు గోదావరిఖని స్విమ్మింగ్ కోచ్ కృష్ణమూర్తి తెలిపారు. విజేతలను ఆయన అభినందించారు.
తెలంగాణ
వెటరన్ ఈత పోటీల్లో కరీంనగర్ జిల్లా క్రీడాకారుల సత్తా


