హైదరాబాద్: 28°C
క్రీడలు

ఈ టార్గెట్ పెడితేనే టీమిండియాకు విజయం 

గాలే టెస్టులో భారత్‌ పటిష్ట స్థితిలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంకను 284 పరుగులకే ఆలౌట్ చేసి 178 పరుగుల ఆధిక్యం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత్ మరో 250 పరుగులు చేస్తే మొత్తం ఆధిక్యం 400 పరుగులకు చేరుతుంది. గాలే పిచ్‌పై ఈ టార్గెట్‌ను ఛేజ్ చేయడం శ్రీలంకకు అత్యంత కష్టమే. దీంతో భారత్ విజయం దాదాపు ఖాయమవుతుందని లెక్కలు చెబుతున్నాయి.