హైదరాబాద్: 28°C
తెలంగాణ

అజాగ్రత్తతో డ్రైవింగ్.. టిప్పర్ డ్రైవర్‌పై కేసు

SRPT: హుజూర్‌నగర్ మండలం గోపాలపురం శివారులో టిప్పర్ ఢీకొని చర్చి ఫాదర్ నాగవెల్లి జేమ్స్ గాయపడ్డారు. ఆగస్టు 15న బైక్‌పై వెళ్తుండగా అతివేగంగా, అజాగ్రత్తగా వచ్చిన టిప్పర్ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదంలో తల, ముఖంపై గాయాలయ్యాయి. కుమారుడు విజయ్‌కుమార్ ఫిర్యాదుతో డ్రైవర్ పి. తిరుమలపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ చలికంటి నరేష్ తెలిపారు.