BPT: బల్లికురవ కూకట్లపల్లి ఎస్టీ కాలనీలో ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములను వెంటనే ఆన్లైన్ చేయాలని డిమాండ్ చేస్తూ.. బాధితులు బల్లికురవ తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. 1990లో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలకు పాసుపుస్తకాలు ఇవ్వడంతో పాటు భూములను ఆన్లైన్ చేయాలని కోరారు. కొత్తగా పెళ్లైన కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
బల్లికురవలో నిరసన కార్యక్రమం


