SS: మడకశిర నియోజకవర్గానికి 12,500 ఇళ్లు మంజూరు చేయాలని కోరుతూ గృహనిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి కొర్లపాటి హెప్సిబారాణికి ఎమ్మెల్యే ఎం.ఎస్.రాజు వినతిపత్రం ఇచ్చారు. అమరావతిలో సోమవారం ఆమెను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా పేదలకు ఇళ్లు కేటాయించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'మడకశిరకు 12,500 ఇళ్లు మంజూరు చేయాలి'


