హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'క్యూఆర్‌తో హాజరు.. యాప్‌తో పుస్తకాలు'

GNTR: గ్రంథాలయాలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేస్తున్నామని ఉమ్మడి గుంటూరు జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్‌పర్సన్ భీమనేని వందనా దేవి తెలిపారు. రాష్ట్ర గ్రంథాలయ యాప్ ద్వారా పుస్తకాల ఎంపిక, ఆన్‌లైన్ సభ్యత్వం, QR హాజరు, పోటీ పరీక్షల పుస్తకాల ముందస్తు బుకింగ్ వంటి ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. పాఠకులు యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.