హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆగస్టు 20న ఏఐఎస్ఎఫ్ నిరసన ర్యాలీ

అన్నమయ్య: మదనపల్లెలో విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐఎస్ఎఫ్‌ జిల్లా కార్యదర్శి కె. మాధవ్‌ విమర్శించారు.  సమస్యల పరిష్కారం కోసం ఆగస్టు 20న నిరసన ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, స్కాలర్‌షిప్‌ బకాయిలు విడుదల చేయాలన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామన్నారు.