JN: స్టేషన్ ఘనపూర్ మున్సిపాలిటీ పరిధిలో గోమాతల రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని గో రక్షక్ దళ్ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు గతంలో మున్సిపల్ కమిషనర్, ఛైర్మన్కు వినతిపత్రాలు అందించినట్లు తెలిపారు. గోహత్యలకు సంబంధించిన ఘటనలపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ను గో రక్షక్ దళ్ ప్రతినిధులు కోరారు.
తెలంగాణ
'గోమాతల రక్షణకు చర్యలు తీసుకోవాలి'


