హైదరాబాద్: 28°C
క్రైమ్

విషాదం.. గోదావరిలో దూకిన ఓ కుటుంబం

AP: రాజమండ్రిలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పంచాయతీరాజ్ ఏఈ నూకరాజు నలుగురు కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నం చేశారు. అయితే, నూకరాజు మనుమడు సురక్షితంగా ఒడ్డుకు చేరాడు. నూకరాజు, ఆయన భార్య, కుమార్తె గల్లంతయ్యారు. వారి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కాగా, వీరి ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.