హైదరాబాద్: 28°C
తెలంగాణ

చెట్టును ఢీకొని యువకుడి మృతి

BHPL: కాటారం మండలం మేడిపల్లి శివారు అటవీ ప్రాంతంలో జాతీయ రహదారిపై బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటనలో మద్దులపల్లికి చెందిన పొట్ల లక్ష్మణ్‌రాజు (20) మృతి చెందాడు. బంధువుల ఇంటికి వెళ్తున్నానని చెప్పి శుక్రవారం బయలుదేరిన అతడు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆరా తీశారు. రెండు రోజుల తర్వాత ఆదివారం బైక్‌తో సహా మృతదేహాన్ని గుర్తించారు.