హైదరాబాద్: 28°C
తెలంగాణ

రోడ్డు ప్రమాదంలో చిరుత కూన మృతి

NGKL: మన్ననూర్‌- శ్రీశైలం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆదివారం చిరుతపులి కూన మృతి చెందింది. మన్ననూర్‌ రేంజ్ గుండం 'ఇ' బీట్ కంపార్ట్‌మెంట్ నం. 331 వద్ద గస్తీ సిబ్బంది చిరుతపులి మృతదేహాన్ని గుర్తించి ఎన్‌టీసీఏ మార్గదర్శకాల ప్రకారం భద్రపరిచారు. నేడు పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.