హైదరాబాద్: 28°C
తెలంగాణ

వందే భారత్ ఢీకొని యువతి మృతి

HYD: మౌలాలి రైల్వే స్టేషన్‌లో విషాదం చోటుచేసుకుంది. గోల్కొండ ఎక్స్‌ప్రెస్‌ నుంచి దిగిన అనంతరం పట్టాలు దాటుతుండగా వందే భారత్‌ రైలు ఢీకొనడంతో జనగామకు చెందిన మానేపల్లి మానస(20) మృతి చెందారు. మౌలాలి హౌసింగ్‌ బోర్డు కాలనీలో తల్లిదండ్రులతో ఉంటూ నర్సుగా పనిచేస్తున్న మానస మృతిపై సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.