హైదరాబాద్: 28°C
వ్యాపారం

స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి ఏంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఎంట్రీ

స్మార్ట్‌ఫోన్ తయారీ రంగంలోకి ఏంబర్ ఎంటర్‌ప్రైజెస్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మేరకు ఒప్పోతో డీల్ కుదుర్చుకుంది. ఇకపై చైనాకు చెందిన ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లను భారత్‌లోనే తయారుచేయనుంది. ఉత్పత్తిని ప్రారంభించిన తొలి ఏడాదిలో దాదాపు 80 లక్షల యూనిట్లను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కంపెనీ పేర్కొంది.