కోనసీమ: మామిడికుదురు మండలం మగటపల్లి సబ్స్టేషన్ పరిధిలో సోమవారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ రాంబాబు తెలిపారు. RDSS, సబ్స్టేషన్ నిర్వహణ పనుల కారణంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మగటపల్లి, గోగన్నమఠం, కొమరాడ, ఈదరాడ, లుటుకుర్రు, ఆదుర్రు, పాసర్లపూడిలంక గ్రామాల్లో కరెంటు ఉండదని అన్నారు.
వార్తలు
నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం


